
ప్రజాశక్తి-పాలకొల్లు : యూత్ సర్వీసు మంత్ లో భాగంగా పాలకొల్లు రోటరీ క్లబ్ సారధ్యంలో శనివారం పాలకొల్లు అంజలి మానసిక దివ్యాంగుల పాఠశాలలో చదువుతున్న విద్యార్దులకు రన్నింగ్, బాస్కెట్ బాల్, త్రోబాలు, క్యారమ్స్, డాన్సులు వంటి పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేస్తామని క్లబ్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ యూత్ సర్వీస్ డైరెక్టర్ మద్దాల వాసు, క్లబ్ సెక్రటరి రావాడ సతీష్ , ట్రెజరర్ ముత్యాల ప్రదీప్ , పాస్ట్ ప్రెసిడెంట్ చందక రాము, రోటరీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ కానూరి ప్రభాకర్, గ్రీటర్స్ కమిటీ చైర్మన్ పోతాబత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు.