Oct 23,2023 14:34

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు పట్టణంలోని 18వ వార్డ్ లో ఎస్సీ ఏరియాలో పాడైన  మంచినీటి పైప్ లైన్  మరామ్మతులు పనులను వెంటనే చేపట్టి ఆ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించిన ఎమెల్యే నిమ్మల రామానాయుడు. పట్టణ విద్యుత్ సబ్ స్టేషన్ వెనుక 20 రోజులుగా మంచినీటి పైప్ లైన్ పాడైన పట్టించుకోని మునిసిపల్ అధికారులు. దీంతో పేద ప్రజలు అనుభవిస్తున్న త్రాగునీటి కష్టాలను స్వయంగా ఆదివారం విజయదశమి రోజున సైకిల్ ఫై పేపర్ వేస్తు వెళ్లి చూసి చలించిన ఎమ్మెల్యే త్రాగునీటి ఇబ్బందులు తీర్చేందుకు రోజుకు 2 సార్లు ట్యాంకర్ ద్వారా త్రాగునీరు అందించాలని మున్సిపల్ కమిషనర్ శేషాద్రిని కోరారు. వారు ట్యాంకర్ కోసం రోజు పనులూ మాని ఎదురు చూడవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పైప్ లైన్ మరామ్మతులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.