Oct 04,2023 13:04

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : నవంబర్ నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయిలో వాలీ బాల్  జట్టుకు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కొడమంచిలి గ్రామానికి చెందిన కొడమంచిలి హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నా పులిదిండి సురేష్ కుమార్ ఏంపికైనట్లు స్కూల్ పిడి చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఆచంట మండల సర్పంచ్ ల ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్ మాట్లాడుతూ  సెప్టెంబర్ 29 వ తేదీన  పెద తాడేపల్లి లోని భారతీయ విద్యా భవన్స్,  నిర్వహించిన ఎస్ జి ఎఫ్  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాలీబాల్ సెలెక్టన్స్ లో అండర్ -14 విభాగం లో రాష్ట్ర స్థాయి జట్టుకు 
ఎంపికయ్యారని తెలిపారు. ప్రతిసంవత్సరం రాష్ట్రస్థాయి వాలీబాల్ జట్టుకు కొడమంచిలి స్కూల్ నుండి విద్యార్థులు ఎంపికవ్వడం అభినందనీయమన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే  వాలీ బాల్ పోటీలలో విద్యార్థి రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్న పిడి చిరంజీవి ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు  రామకృష్ణ. ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమణరావు, పోలిశెట్టి వనమారాజు తదితరులు సురేష్ కుమార్ ను అభినందించారు.