Jul 06,2023 11:22

ప్రజాశక్తి-కే.కోటపాడు : మండలంలోని ఏ కోడూరు గ్రామంలో విశాఖ ఉక్కు రక్షణకై సిపిఎం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కార్యదర్శులు  24 గంటల దీక్షను జయప్రదం చేయండి గోడ పత్రికను ఏ కోడూరులో విడుదల చేశారు.

డిమాండ్లు : 

1. కేంద్ర బీజేపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ అమ్మకు ఆపాలని

2. విశాఖ స్టీల్ ప్లాంట్ ను పూర్తి సామర్థ్యంతో నడపాలని

3. విశాఖ స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలని,

4. 8500 మంది నిర్వాసితుల  కు పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలిని,

5. రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన పార్టీలు చిత్తశుద్ధితో కేంద్రంతో పోరాడాలని, స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపించాలని గోడ పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గండి నాయనబాబు, ఎర్ర దేవుడు, వనము సూర్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు.