Oct 31,2023 15:15

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ: నవంబర్‌ 2 నుండి 8వ తేదీ వరకు విశాఖపట్నం లో జరగనున్న ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యఅతిథిగా  పాల్గొనేందుకుగాను  నవంబర్‌ 2 ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారని ముఖ్యమంత్రి అదనపు వ్యక్తిగత కార్యదర్శి కే.నాగేశ్వర్‌ రెడ్డి మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం 8:05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్‌ నుండి బయలుదేరి 8:50 గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్‌ కు చేరుకుంటారు. ఎయిర్పోర్ట్‌ నుండి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా మధురవాడలోని ఐటీ హిల్‌ నెంబర్‌ 3కి చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గంలో 9:30 గంటలకు రుషికొండ వద్ద ఉన్న రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌ కు చేరుకుంటారు. అనంతరం 9:30 నుండి 11:00 వరకు ఇంటర్నేషనల్‌ కమిషన్‌ అండ్‌ ఇరిగేషన్‌ డ్రైనేజ్‌ (ఐసిఐడి) 25వ కాంగ్రెస్‌ సమావేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గంటారు. ఈ కార్యక్రమం అనంతరం 11:05 గంటలకు రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌ రిసార్ట్‌ నుండి బయలుదేరి రోడ్డు మార్గంలో మధురవాడ ఐటి హిల్‌ నెంబర్‌ 3 బద్ద ఉన్న హెలిపాడ్‌ కు చేరుకొని అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 11:35 నిమిషాలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్‌ కు చేరుకుంటారు. అక్కడి నుండి ఆయన 11:45 గంటల ప్రత్యేక విమానంలో విశాఖపట్నం నుండి బయలుదేరి 12:30 గంటలకు విజయవాడ చేరుకుంటారు.