Feb 01,2023 14:12

బెంగళూరు  :  ఎన్నికల వేళ కేంద్రం కర్ణాటకకు భారీ నజరానాను ప్రకటించింది. కర్ణాటకలో ఎగువ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల సాయం అందించనుందని  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. కర్ణాటకలోని కరువు పీడిత మధ్య ప్రాంతాలలో, ఎగువ భద్ర ప్రాజెక్ట్‌ కోసం రూ.5,300 కోట్ల కేంద్ర సహాయం ఇవ్వబడుతుందని ప్రకటించారు.   ఎగువ భద్ర ప్రాజెక్ట్‌లో తుంగా నది నుంచి భద్ర జలాశయానికి 17.40 వేల మిలియన్‌ క్యూబిక్‌ అడుగుల (టిఎంసి) నీటిని, భద్ర రిజర్వాయర్‌ నుంచి 29.90 టీఎంసీలను ఎగువ భద్ర ప్రాజెక్ట్‌లో వినియోగానికి ఎత్తివేయాలని భావిస్తున్నారు.  ఎండిపోయిన ప్రాంతాల నీటి అవసరాలను తీర్చడంలో ఈ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికి కీలకమైనది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో భద్ర ప్రాజెక్టు ఉంది. బడ్జెట్‌లో కర్ణాటకకు రూ. 5,300 కోట్ల గ్రాంట్‌ను ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బమ్మై ఆర్థికమంత్రి, ప్రధాని మోడీలకు కృతజ్ఞతలు తెలిపారు.