Mar 28,2023 16:52

చెన్నై  :   అన్నాడిఎంకె జనరల్‌ సెక్రటరీగా ఎడప్పాడి కె పళనిస్వామి (ఇపిఎస్‌) మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి ఓ పన్నీర్‌ సెల్వం (ఒపిఎస్‌) నాయకత్వ వివాదంపై  హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్  ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే పళనిస్వామి నియామకం జరగడం గమనార్హం. పార్టీ జనరల్‌ కౌన్సిల్‌ తీర్మానాలు మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికల నిర్వహణను సవాలు చేస్తూ పదవీచ్యుతుడైన ఒపిస్‌, అతని సహాయకులు దాఖలు చేసిన అన్ని పిటిషన్‌లను ఇటీవల మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న పళనిస్వామిని అన్నాడిఎంకె ఉన్నత పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.  ఈ సందర్భంగా పళనిస్వామి తన మద్దతుదారులకు, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ అభివృద్థి పధాన నడుస్తుందని పలువురు పార్టీ నేతలు పేర్కొన్నారు.