హొనొలులు : హవాయి ద్వీపంలోని లాహైనా, మౌయిలు కార్చిచ్చుతో బూడిద కుప్పలుగా మారాయి. మృతుల సంఖ్య 89కి చేరినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అన్నారు. ‘‘మా వెనుక పర్వతం మంటల్లో చిక్కుకుంది. అధికారుల నుండి ఎలాంటి ఆదేశాలు రాలేదు’’ అని జాక్ అనే వ్యక్తి తెలిపారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డామని, అత్యవసరమైన వస్తువులు జాగ్రత్త చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత 100 ఏళ్లలో ఇంతటి తీవ్రమైన ప్రమాదం ఎన్నడూ చూడలేదని అమెరికాలోని ఫైర్ అడ్మినిస్ట్రేటర్ లోరీ మూర్ మెరిల్లీ పేర్కొన్నారు. ''అగ్ని ప్రమాద తీవ్రతను తక్కువగా అంచనా వేశాము'' అని హవాయి కాంగ్రెస్ మహిళా నేత జిల్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం వల్ల విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని అన్నారు. హవాయి ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తు ఇదేనని మోయి గవర్నర్ జోష్ గ్రీస్ శనివారం పేర్కొన్నారు. 2,200 నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయన్నారు.