Nov 19,2020 20:56

నూతన మదీనా మసీద్‌ను ప్రారంభిస్తున్న నాయకులు



ప్రజాశక్తి - బైరెడ్డిపల్లి : మండలంలో నెల్లిపట్ల గ్రామపంచాయతీ పరిధిలోని బాపలనాత్తం గ్రామంలో స్థానిక మండల వైయస్సార్‌ పార్టీ మండల మాజీ వైస్‌ ఎంపిపి రెడ్డప్ప. స్థానిక హజరత్‌ కలిసి నూతన మదీనా మసీద్‌ ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం దొడ్డ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముస్లిం సోదరులకు ప్రభుత్వంలో ఉన్నత పదవులు ఇచ్చి ఘనంగా సత్కరించిన ప్రభుత్వంగా గుర్తింపు పొందినది అలాగే స్థానిక ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిని ముస్లిం సోదరులు దష్టిలో పెట్టుకొని వైయస్సార్‌ పార్టీ ముందంజలో ఉండేవిధంగా చూడాలని కోరారు.