Oct 21,2023 15:39

ప్రజాశక్తి-నరసరావుపేట : పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధినిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు, యస్పి రవిశంకర్ రెడ్డి, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ మరియు జిల్లా పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.