Oct 03,2020 21:41
హథ్రాస్ కేసు సిబిఐకి...

లఖ్‌నవూ: హథ్రాస్ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమౌతోన్న నేపథ్యంలో  ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  ట్విటర్‌లో పేర్కొన్నారు.  యూపీ డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు బాధిత కుటుంబాన్ని కలిసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  మహిళలపై దారుణమైన నేరాలను నిరోధించలేక పోవడంపై  వెల్లువెత్తిన నిరసనల ఒత్తిడిలో ఉన్న అధికార బిజెపి... హథ్రాస్ కేసు సిబిఐకి అప్పగించింది.