
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని, ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించడం తప్ప ఆచరణలో మాత్రం శూన్యం అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరే రామ్ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం, శేషమ్మ చెరువు తదితర గ్రామాల్లో శనివారం పంట పొలాలలో పర్యటించి ఎండిపోయిన వరిచేలు నెరలు తీయడం సాగునీరు అందక వేసిన ఎరువులు గుళికలు అలాగే ఉన్నాయని దీనివల్ల వరి దుబ్బుకు ఏమాత్రం ప్రయోజనం లేదని హరే రామ్ అన్నారు అనంతరం ఇరిగేషన్ అధికారితో సాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండిపోతున్న పంట పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా దేవ కాలువలో చెత్తాచెదారంతో పూడుకుపోయిన కారణంగా సాగునీరు శివారు గ్రామాలకు అందడం లేదని రైతులను గగ్గోలు పెడుతున్నారు అన్నారు. ఈ సందర్భంగా దేవ వద్ద పనిచేస్తున్న రైతు వద్దకు రైతు సంఘం బృందo వెళ్లి అక్కడ పర్యవేక్షించారు. అనంతరం రైతు భరోసా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ అసిస్టెంట్ తో మాట్లాడి ధాన్యం కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని గొను సంచులు అందుబాటులో ఉంచాలని. ఈ క్రాఫ్ట్ ఈ కేవైసీ తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని, తేమ శాతం రైతు భరోసా కేంద్రం వద్ద చూపిన విధంగా రైస్ మిల్ వద్ద కూడా అదే తేమశాతానికి అన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరమల్లు వీర్రాజు బుర్ర నాగేశ్వరరావు ఆకుమర్తి పాల్గొనా వరదా బాపనయ్య తాళ్లూరు రాము పలాస నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.