Oct 11,2023 17:06
  •  ఎలక్షన్ గోడౌన్ ను పరిశీలించిన  జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్... 
  • రెండంచెల భద్రత నడుమ ఈ నెల 16 నుండి ఈవీఎంల ఫస్ట్ లెవెల్ చెకింగ్ : జిల్లా కలెక్టర్ 

ప్రజాశక్తి-చిత్తూరు అర్బన్ : జిల్లా సచివాలయంలోని  ఎలక్షన్ గోడౌన్ లో భద్రపరిచిన ఈవిఎంల కుబెల్ ఇంజనీర్లచే కొనసాగుతున్న ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ను జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ పరిశీలించారు. బుధవారం ఉదయం బెల్ కంపెనీ ప్రతినిధులు ఈవీఎం లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఈవీఎం గోడౌన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ మాట్లాడుతూ.. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో రెండంచెల భద్రత నడుమ 12 మంది బెల్ ఇంజనీర్ల సమక్షంలోఈనెల 16 నుండి ఫస్ట్ లెవెల్ చెకింగ్ జరుగుతుందని, జిల్లాకు కొత్తగా బెల్ కంపెనీ నుండి జిల్లాకు చేరుకున్న 2510 బ్యాలెట్ యూనిట్లు, 4390 కంట్రోల్ యూనిట్ల, 3617 వివి పాడ్స్ లకు ఆక్సెప్టేన్స్ టెస్ట్ ప్రొసీజర్ ను చేస్తున్నారని, జిల్లాలో గతంలో ఉన్న పాత 2353 బ్యాలెట్ యూనిట్లు, 1448 కంట్రోల్ యూనిట్ల, 1711 వివి పాడ్స్ కలవనన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 24/7 పటిష్ట పోలీస్ భద్రత, సి.సి కెమరాల పర్యవేక్షణ, విజిటింగ్ రిజిస్టర్ వంటి తదితరాలు ఏర్పాటు చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ చంద్ర శేఖర్ నాయుడు, ఎన్నికల సూపరింటేoడెంట్ బ్యూలా, ఎలక్షన్స్ సెల్  సిబ్బంది ఉమాపతి, మనోజ్ కుమార్, రెవెన్యూ సిబ్బంది సంబంధింత అధికారులు కలరు.