జింబాబ్వే : జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశాడు. ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 49 ఏళ్ల స్ట్రీక్ చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. జింబాబ్వే తరపున 1993 నుంచి 2005 వరకు హీత్ స్ట్రీక్ ఆడాడు. ఆ దేశ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. తన కెరీర్లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లతో కలిపి 4,933 పరుగులు చేసి, 455 వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరపున టెస్టుల్లో వెయ్యి పరుగులు, 100 వికెట్లు... వన్డేల్లో 2 వేల పరుగులు, 200 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా హీత్ స్ట్రీక్ పేరిట రికార్డు ఉంది. ఆయన మతి పట్ల మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు.










