Nov 22,2023 10:40

ప్రజాశక్తి - పిఎం.పాలెం (విశాఖపట్నం) : ఈ నెల 23న విశాఖలో జరిగే టి - 20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు వచ్చిన భారత్‌, ఆసీస్‌ క్రికెటర్లు మంగళవారం సాయంత్రం నెట్‌ ప్రాక్టీస్‌ చేశారు. వారంతా రుషికొండ సమీపంలో ఉన్న రాడిసన్‌ బ్లూలో ఆతిథ్యం పొందుతున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం పిఎం.పాలెం క్రికెట్‌ స్టేడియానికి చేరుకుని బి - గ్రౌండ్‌లో ముమ్మర సాధన చేశారు. ఇదిలా ఉండగా మ్యాచ్‌ ఏర్పాట్లపై విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, సిపి. రవిశంకర్‌, జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ, ఎసిఎ కార్యదర్శి ఎస్‌ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి స్టేడియంలో ఆర్గనైజింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు సమన్వయంతో మెలిగి ఎలాంటి లోటుపాట్లూ లేకుండా చూడాలని ఆదేశించారు.