Nov 22,2023 10:49
  •  అతిక్రమిస్తే ఐదు పరుగులు పెనాలీ

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి పురుషుల వన్డే, టీ20 క్రికెట్‌లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. ''స్టాప్‌ క్లాక్‌'' పేరుతో ఉండే ఈ నిబంధనను వచ్చే ఏడాది (2024) ఏప్రిల్‌ వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ కొత్తగా ఓవర్‌కు ఓవర్‌కు మధ్య 60 సెకెన్ల నిర్దిష్ట సమయాన్ని గ్యాప్‌ టైమ్‌గా ఫిక్స్‌ చేసింది. బౌలింగ్‌ జట్టు ఈ సమయంలోపే మరుసటి ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ను దించాలి. రెండుసార్లు నిర్దిష్ట వ్యవధి దాటితే మన్నిస్తారు. మూడోసారి ఆలస్యమైతే మాత్రం బౌలింగ్‌ జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీగా విధిస్తారు. ఫీల్డ్‌ అంపైర్లు స్టాప్‌ క్లాక్‌తో ఈ సమయాన్ని నిర్ధారిస్తారు.