Apr 27,2023 21:20

బెంగళూరు : దిగ్గజ ఐటి కంపెనీ విప్రో 2022-23 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 0.4 శాతం తగ్గుదలతో రూ.3,074 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.3,087 కోట్ల లాభాలు నమోదు చేసింది. క్రితం క్యూ4లో కంపెనీ రెవెన్యూ 11 శాతం పెరిగి రూ.23,190 కోట్లుగా చోటు చేసుకుంది. కాగా.. వాటాదారుల నుంచి 26.9 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ఇది మొత్తం షేర్లలో 4.91 శాతానికి సమానం. ప్రతీ షేర్‌కు రూ.445 చెల్లించడానికి ముందుకు వచ్చింది. ఇందుకోసం దాదాపు రూ.12,000 కోట్ల మేర వ్యయం చేయనుంది.