Nov 17,2023 21:30

న్యూఢిల్లీ : ప్రముఖ గృహోపకరణాల కంపెనీ ఎల్‌జి భారత మార్కెట్లోకి కొత్త వాష్‌ టవర్‌ను విడుదల చేసిననట్లు ప్రకటించింది. లాండ్రీ చేసే విధానంలో భారతీయ గృహాల కోసం యూనిబాడీని డిజైన్‌ చేయడం జరిగిందని ఎల్‌జి ఇండియా ఎండి హాంగ్‌ జు జియోన్‌ పేర్కొన్నారు. లాండ్రీ సొల్యూషన్స్‌లో ఇది ఒక గొప్ప మైలురాయి అని తెలిపారు. ఎల్‌జి వాష్‌టవర్‌ గరిష్ట అమ్మకం ధరను రూ.2,75,000గా నిర్ణయించింది.