Nov 15,2023 21:23

హైదరాబాద్‌ : సర్వోటెక్‌ పవర్‌ సిస్టమ్స్‌ కొత్తగా ఇవి ఛార్జింగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. తమ సబ్సీడరీ సంస్థ సర్వేటెక్‌ ఇవి ఇన్‌ఫ్రా విద్యుత్‌ వాహనాల చార్జ్‌ పాయింట్‌ ఆపరేటర్‌ (సిపిఒ) వ్యాపారాన్ని నిర్వహించనుందని వెల్లడించింది. వచ్చే కొన్నేళ్లలో దేశ వ్యాప్తంగా 5,000 చార్జింగ్‌ స్టేషన్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. సర్వోటెక్‌ పలు చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు ఇవి ఛార్జర్స్‌ను అందిస్తుంది. వచ్చే కొన్నేళ్లలో ఇవి చార్జింగ్‌ స్టేషన్లకు డిమాండ్‌ పెరగనున్న నేపథ్యంలో సొంతగా ఈ వ్యాపారంలోకి దిగినట్లయ్యింది.