న్యూఢిల్లీ : గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడానికి వీలుగా వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన పెంచడానికి ఐఒ టెక్తో సిన్జెంటా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇందులో డ్రోన్ సాంకేతికత ఉపయోగంపె గ్రామీణ యువతకు శిక్షణ అందించడంతో పాటుగా అభివృద్థి చేసేందుకు 2000 డ్రోన్లను అందుబాటులోకి తీసుకు రానున్నట్లు సిన్జెంటా పేర్కొంది. దేశంలోని విభిన్న ప్రాంతాలలో ఐఒ టెక్ వరల్డ్ డ్రోన్ సాంకేతికత వినియోగించి సిన్జెంటా అనుమతించిన రసాయనాలను స్ప్రే చేయడం గురించి కలిసి పనిచేయనున్నాయని తెలిపింది. భారీ స్ధాయిలో 400 ఎకరాలపై ట్రయల్స్ చేసిన తర్వాత 20 పంటలకు సంబంధించి డాటాను రెగ్యూలేటర్లకు సమర్పించడం జరిగిందని సిన్జెంటా ఎండి, కంట్రీ హెడ్ సుశీల్ కుమార్ పేర్కొన్నారు.










