
ప్రజాశక్తి-ఆదోనిరూరల్(కర్నూలు) : ఇస్వి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా కే.శ్రీనివాసులు గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ ఉన్న ఎస్ఐ విజయలక్ష్మి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు బదిలీ కాగా, పెద్దకడుబూర్ నుంచి కే.శ్రీనివాసులు సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తానన్నారు. అందుకు సహకరించాలని ప్రజలను కోరారు. అలాగే అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం,అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. గతంలో సి.బెళగల్, ఎమ్మిగనూరు టౌన్, పెద్దకడుమూర్, పోలీస్ స్టేషన్లో పనిచేశానన్నారు. స్టేషన్ పరిధిలో ఏలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన 9121101143 కిసమాచారం అందించాలన్నారు. ప్రజా శాంతికి కృషి చేస్తానని,శాంతిభద్రతల పర్యవేక్షణ నిష్పక్షపాతంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.