Nov 11,2023 14:44

శ్రీనగర్‌ :    జమ్ముకాశ్మీర్‌ పోలీస్‌ ప్రత్యేక విభాగం, స్టేట్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎస్‌ఐఎ) శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు చేపట్టింది. ఉగ్రవాదం, వేర్పాటు వాదానికి టెర్రర్‌ ఫండింగ్‌ కేసుకు సంబంధించిన రూ.85 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో దాడులు జరిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీనగర్‌, పుల్వామా, అనంతనాగ్‌ జిల్లాల్లోని 10 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు ఎస్‌ఐఎ అధికార ప్రతినిధి తెలిపారు. మొబైల్‌ పరికరాలు, ల్యాప్‌టాప్‌లు, సిమ్‌కార్డులు, పాస్‌పోర్ట్‌లు, చెక్కులు, పాస్‌బుక్‌లు, క్రెడిట్‌ మరియు డెబిట్‌ కార్డులు వంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. శ్రీనగర్‌లోని రెండు ప్రదేశాలలో, పుల్వామాలోని ఏడు చోటల, అనంతనాగ్‌లో నవంబర్‌ 8న ఎస్‌ఐఎ దాడులు జరిపిన సంగతి తెలిసిందే.