Oct 30,2023 11:33

శ్రీనగర్‌ :  జమ్ముకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భద్రతా బలగాలు భగం చేశాయి. ఈ దాడిలో ఓ ఉగ్రవాది మరణించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఒసి) సమీపంలోని కెరాన్‌ సెక్టార్‌లోని జుమాగుండ్‌ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నించారు. స్పందించిన భద్రతా బలగాలు వారిపై కాల్పులు చేపట్టాయి. సోమవారం ఉదయం ఆ ప్రాంతం నుండి ఓ ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.