న్యూఢిల్లీ : భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాన్ని ఆన్లైన్లో పెంచుకోవడానికి ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు గోడాడీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు ఆఫర్ కింద తొలి ఏడాదికి ఇన్తో ముగిసే డొమైన్ల కోసం రూ.49కి, ఇన్ఫో డొమైన్లను రూ.319కి, కామ్తో ముగిసే డొమైన్లను రూ.499కి, ఒఆర్జి డొమైన్లను రూ.749కే అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్లు మార్చి 31 వరకూ అందుబాటులోఉంటాయని తెలిపింది.










