
ప్రజాశక్తి-కర్నూలుస్పోర్ట్స్ : హ్యాండ్ బాల్ ఫైనల్స్లో కల్లూరు జట్టుపై 12 - 10 గోల్స్ తో షరీన్ నగర్ జట్టు విజయం సాధించి నగదు బహుమతి అందుకుంది. ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్యాంపు క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఆహ్వానిత హ్యాండ్బాల్ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొన్నాయి. హాండ్ బాల్ మాజీ కార్యదర్శి రామాంజనేయులు అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టిన రోజున కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఈ సంతోష సమయంలో క్రీడాకారులు భాగస్వాములు కావాల్సిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ఎం. భాష, క్రీడా సంఘ ప్రతినిధులు ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుల కర్నూలు జిల్లా సంఘ అధ్యక్షులు చిన్న సుంకన్న, అంతర్జాతీయ హ్యాండ్ బాల్ వెంకటేష్, పాటు వ్యాయామ ఉపాధ్యాయులు నాగరాజు, గంగాధర్, శీను ,సురేందర్ పలువురు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారులు గురు, రాఘవేంద్ర, సువర్ణ, తదితరులు కవిత పాల్గొన్నారు.