Nov 22,2023 10:17

ప్రజాశక్తి- గంపలగూడెం (ఎన్‌టిఆర్‌ జిల్లా) : సాఫ్ట్‌ బాల్‌ (ఫీల్డింగ్‌ అండ్‌ బ్యాటింగ్‌) పోటీల్లో ప్రతిభ కనబర్చి ఎన్‌టిఆర్‌ జిల్లా గంపలగూడెం గ్రామానికి చెందిన హారిక జాతీయ క్రీడలకు ఎంపికయ్యారు. వచ్చే ఏడాది జనవరిలో ఛత్తీస్‌గఢ్‌లో జరగనున్న జాతీయ క్రీడల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యాన సాఫ్ట్‌బాల్‌ పోటీల్లో హారిక ప్రతిభ కనబర్చి ఈ అర్హత సాధించారు. దీంతో, ఆమె విద్యనభ్యసిస్తోన్న గంపలగూడెం మండలం సత్యాలపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శేషం రాజు, వ్యాయామ ఉపాధ్యాయులు గుర్రం గోపాలరావు, పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థినీ, విద్యార్థులు హారికను అభినందించారు.