Sep 30,2023 12:10

ప్రజాశక్తి - కోట (చిత్తూరు) : కృష్ణా జిల్లా నునా బాలుర జెడ్‌ పి పాఠశాలలో సెప్టెంబర్‌ 21,22,23 తేదీల్లో ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా కుస్తీ పోటీల్లో సీనియర్‌ ఎంపీసీ చదువుచున్న టి.చంద్రపాల్‌ అనే విద్యార్థి 60 కేజీ ల విభాగంలోని ప్రీ స్టైల్‌ లో బంగారు పతకాన్ని సాధించారాని డాక్టర్‌ బీ ఆర్‌ అంబెడ్కర్‌ గురుకుల ప్రిన్సిపాల్‌ అద్దూరి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ ఎంపిక అయిన విద్యార్థి మధ్యప్రదేశ్‌ లో అక్టోబర్‌ 3వ తేది నుండి 8వ తేది వరకు జరిగబోయే జాతీయస్థాయి పోటీల్లో పాల్గంటారని అన్నారు. ఈ సందర్బంగా ఎంపికైన విద్యార్థిని ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర్లు, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. అదేవిధంగా ఎంపికకు కఅషి చేసిన పాఠశాల, కళాశాల పి.డి.వి. రాజ్‌ కుమార్‌, పి.ఇ.టి. డి.రమణయ్య లకు ప్రిన్సిపాల్‌ అభినందనలు తెలిపారు.