Sep 26,2023 12:28

విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం నూతన రాష్ట్ర కమిటీలో బబ్బిలి నుంచి ఇద్దరికి స్థానం లభించింది. రాష్ట్ర అధ్యక్షులుగా రౌతు రామమూర్తి, రాష్ట్ర కార్యదర్శిగా లచ్చుపతుల జగన్నాధం ఏకగ్రీవంగాఎన్నికయ్యారు. కాకినాడలో ఈనెల 25, 26న జరిగిన రాష్ట్ర సమావేశాల్లో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీలో స్థానం సాధించిన రామమూర్తి, జగన్నాధంకు బబ్బిలి తాలుక అద్యక్షులు కర్రి సత్యనారాయణ, సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.