Nov 14,2023 13:05

మార్కాపురం (ప్రకాశం) : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలురలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి పాముల.సాయి వెంకట శివ విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి యస్‌జీయఫ్‌ కరాటే పోటీలలో పాల్గని బంగారు. పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మునగాల.చంద్రశేఖర్‌ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ ... పాఠశాల నుంచి కరాటే క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినీ, తర్ఫీదు ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు. జాతీయ స్థాయిలోనూ పతకం సాధించి రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్‌ ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.జాహ్నవి ప్రియా, క్రిష్ణ గౌడ్‌, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.