ముంబయి : ప్రముఖ ఎఫ్ఎంసిజి కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యుఎల్) నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండిగా సంజీవ్ మెహతా నియమితులయ్యారు. జూన్ 27న ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. 10 ఏళ్ల పాటు ఈ హోదాలో కొనసాగనున్నారు. అదే విధంగా సౌత్ ఏసియాకు ప్రెసిడెంగ్గా కొనసాగుతారని ఆ కంపెనీ తెలిపింది. హెచ్యుఎల్లో వివిధ హోదాల్లో పని చేశారు.










