న్యూఢిల్లీ : ఎఫ్ఎంసిజి ఉత్పత్తుల అదాని విల్మర్ నుంచి వైదొలగాలని ఆదాని గ్రూపు యోచిస్తోంది. ఇందుకోసం తన వాటాను విక్రయించేందుకు పలు అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో చర్చలు జరుపుతుందని సోమవారం పలు రిపోర్ట్లు వచ్చాయి. అదాని విల్మర్ ప్రధానంగా ఫోర్సూన్లో పలు రకాల వంట నూనెలు, పప్పులు, బియ్యం, చక్కెర తదితర అహార ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఇకపై కేవలం కీలక రంగాల వ్యాపారాలపై మాత్రమే దృష్టి పెట్టాలని అదానీ గ్రూప్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సింగపూర్కు చెందిన 'విల్మర్ ఇంటర్నేషనల్' భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ను వైదొలగాలని అదాని గ్రూప్ ఉంది. అదాని విల్మర్లో ఇరు సంస్థలకు 43.97 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ నెల చివరి కల్లా విక్రయంపై స్పష్టత రానుందని సమాచారం.