- బంధన్ ఎఎంసి సేల్స్ హెడ్ గౌరబ్
హైదరాబాద్ : పెట్టుబడులకు ఉత్తమ మార్గాల్లో ఒక్కటని బంధన్ మ్యూచువల్ ఫండ్ పేర్కొంది. ఇంతక్రితం ఈ సంస్థ ఐడిఎఫ్సి ఎంఎఫ్గా ఉంది. సిప్ పెట్టుబడిదారులకు నిర్ధిష్ట కాల వ్యవధిలో క్రమం తప్పకుండా పెట్టుబడులకు అనుమతిస్తుందని బంధన ఎఎంసి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ గౌరబ్ పారిజా పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2022-23లో సిప్ల్లో పెట్టుబడులు 25 శాతం పెరిగి రూ.1.56 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు.










