హైదరాబాద్ : నగరంలోని హైటెక్స్లో ఏప్రిల్ 28, 29 తేదిల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ట్రేడ్ ఎక్స్ పోను నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ రెన్యూఎక్స్7వ ఎడిషన్లో డిసిఆర్ మాడ్యూల్స్ మోనోఫెషియల్, బైఫేషియల్ వేరియంట్లు అందుబాటులో ఉంటాయని గోల్డి సోలార్ గ్లోబల్ హెడ్ హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. పవర్ అవుట్పుట్ 520 డబ్ల్యుపి నుండి 550 డబ్ల్యుపి వరకు డిసిఆర్ మాడ్యుల్స్ ఉంటాయని.. ఇవి నివాస, ప్రభుత్వ ప్రాజెక్టులకు అనువైనవని తెలిపారు.










