Mar 15,2023 20:53

హైదరాబాద్‌ : జపనీస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ఒనిట్సుకా టైగర్‌ తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రముఖ నటీ రష్మిక మందాన్నను నియమించుకున్నట్లు తెలిపింది. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే మందానన్న ప్రచారకర్తగా ఎంచుకున్నట్లు పేర్కొంది. ఫ్యాషన్‌తో పాటు స్పోర్ట్స్‌, ఇన్నోవేషన్‌తో కలిపి అత్యుత్తమ సమకాలీన కలెక్షన్‌లను అందించనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.