వసుంధర విజ్ఞాన వికాస మండలి నిర్వహించిన కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి విద్యార్థుల కవితల పోటీకి వచ్చిన మొత్తం కవితల నుంచి ఐదు ఉత్తమ కవితలు ఎంపిక చేస్తామని ప్రకటించినప్పటికీ విద్యార్థులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో మొత్తం 9 కవితలను ఎంపిక చేశాం. జె.వైష్ణవి (టీఎంఆర్ఎస్ గర్ల్స్) బాలానగర్, నాగోల్, చిన్మయి (విజయవాడ), సి.హెచ్.సాయి (జెడ్పీహెచ్ఎస్) బొల్లారం, జిన్నారం, సి.హెచ్.ప్రేరణ, అభిలాష్ శర్మ, విజయ హైస్కూల్, నిజామాబాద్, సాయికీర్తన (జెడ్పీహెచ్ఎస్) మార్కాపురం, ప్రకాశం జిల్లా; జె.రమ్య (టీఎంఆర్ఎస్ గర్ల్స్) బాలానగర్, నాగోల్, కొలుపుల నందిని (జెడ్పీహెచ్ఎస్), దుగ్గొండి, వరంగల్; పధ్వీ (జెడ్పీహెచ్ఎస్) లక్ష్మీపురం విజేతలుగా ఎంపికయ్యారు. వీరికి త్వరలో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానం చేస్తాము.
- వి.మధుకర్, వ్యవస్థాపకులు,
సుమలత, కన్వీనర్, వసుంధర విజ్ఞాన వికాసమండలి










