పెన్నా సాహిత్య పురస్కారానికి 2022 సంవత్సరానికి దాదాపుగా 40 కవితా సంపుటాలు వచ్చాయి. వాటిలో 2022 పెన్నా సాహిత్య పురస్కారానికి డాక్టర్ సుంకర గోపాలయ్య రచించిన 'మా నాయన పాట' కవితా సంపుటి ఎంపికైంది. న్యాయ నిర్ణేయతలుగా మేడిపల్లి రవికుమార్, మందరపు హైమావతి వ్యవహరించారు. త్వరలో జరగబోతున్న పెన్నా సాహిత్య పురస్కార సభలో వారికి నగదు బహుమతి మరియు పురస్కారాన్ని అందజేస్తాము.
- అవ్వారు శ్రీధర్ బాబు, అధ్యక్షుడు,
పెన్నా రచయితల సంఘం










