Feb 27,2023 12:33

విజయవాడ : మహిళల దినోత్సవాన్ని పురస్కరించుకొని ... మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మార్చి 4 వ తేదీన విజయవాడ ఎంబివికె భవన్‌లో ' 2023 మహిళా సంస్కృతిక సమ్మేళనం ' నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ... కాలేజీ విద్యార్థులకు, మహిళలకు కలిపి మహిళల వివక్షపై చిత్రలేఖనం పోటీలను, అభ్యుదయ గీతాలాపన పోటీలు, మహిళా వివక్షతపై 3 నిముషాల ప్రసంగాల పోటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మార్చి 4 మధ్యాహ్నం 2 గంటలకు పాటల పోటీలుంటాయని, 3 గంటలకు చిత్రలేఖనం పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు ముందుగా వారి వివరాలను మార్చి 2వ తేదీలోపు ఇవ్వాల్సిందిగా వివరించారు. పూర్తి సమాచారం కోసం 9490098022 కు ఫోన్‌ చేయవచ్చునని పేర్కొన్నారు.