విజయవాడ : విజయవాడ గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్ శుక్రవారం ఆవిష్కరించారు. తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ... తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు ఇండిస్టీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని చెప్పారు. అయన వారసత్వంతో ఇండిస్టీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారని హర్షాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ షూటింగ్లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషంగా ఉందన్నారు. నగర ప్రజల తరపున కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సిఎం జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.