Jul 11,2022 12:27

ఎన్‌టిఆర్‌ : ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ ... సిపిఎం పిలుపు మేరకు నేడు అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం విజయవాడలోని మ్యూజియం రోడ్డు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో 'చలో కలెక్టరేట్‌' భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. నేతలు మాట్లాడుతూ ... జూన్‌ ఒకటో తేదీ నుండి విజయవాడ నగరం, వివిధ పట్టణాలు, గ్రామాల్లో వందలాది దళాలతో ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అధ్యయనం చేశామన్నారు. నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, బస్‌ ఛార్జీలు భరించలేనంతగా పెరుగుతున్నాయని అన్నారు. తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళుతున్నామని, వాటి పరిష్కారానికి అధికారులు తోడ్పడాలని కోరారు.

1

 

2

 

4

 

5