Aug 25,2023 15:32

హంగేరి : వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్షిప్‌ ఫైనల్స్‌కు భారత్‌ జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా అర్హత సాధించాడు. నేడు జరిగిన క్వాలిఫైయర్స్‌ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు బల్లెం విసిరి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. హంగేరి వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్షిప్‌ క్వాలిఫైయర్స్‌లో.. క్వాలిఫైయింగ్‌ గ్రూప్‌ - ఎలో పోటీపడిన నీరజ్‌ చోప్రా 88.77 మీటర్లు విసిరాడు. దీంతో ఫైనల్‌కు కట్‌ ఆఫ్‌ మార్క్‌ 83 మీటర్లను అధిగమించడంతో ఫైనల్స్‌కు చేరాడు. ఇక ఆదివారం రోజు ఫైనల్‌ జరగనుంది.