
ప్రజాశక్తి- నందిగామ (ఎన్టిఆర్) : వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ... మంగళవారం పట్టణంలోని కోర్ట్ కాంప్లెక్స్ ఆవరణంలో వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.