
ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో సాగర్ సిమెంట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇన్స్టా పవర్ సిమెంట్ ను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సాగర్ సిమెంట్ జెఎమ్డి శ్రీకాంత్ రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ... ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం కోసం ఇతర కట్టడాలకు ఉపయోగించే విధంగా ఈ సిమెంటును తయారు చేశారని అన్నారు. ముందుగా ఈ పవర్ సిమెంట్, ఈ వాహనాలను ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ప్రెసిడెంట్ గణేష్, ప్లాంట్ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
