Aug 20,2023 05:00
  • నేడు ఐర్లాండ్‌తో రెండో టి20
  • రాత్రి 7.30గం||ల నుంచి

డంబ్లిన్‌: ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టి20లో నెగ్గిన టీమిండియా.. ఇక సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం డంబ్లిన్‌ వేదికగా జరిగిన తొలి టి20లో కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రా తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి ఐర్లాండ్‌ను ఒత్తిడి పడేశాడు. పేసర్లకు తోడు స్పిన్నర్‌ రవి బిష్ణోరు కూడా మెరవడంతో ఐర్లాండ్‌ జట్టును కేవలం 139పరుగులకే పరిమితం చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 47పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఉన్న దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచి పోయింది. దీంతో డక్‌వర్‌ లూయిస్‌ పద్ధతిలో టీమిండియా నెగ్గినా.. ఆ విజయం అభిమానులకు కొంత నిరాశను మిగిల్చింది. ఈ క్రమంలో ఐర్లాండ్‌తో ఆదివారం జరిగే రెండో టి20లో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌ తర్వాత ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌ల ముందు బుమ్రాకు ఈ సిరీస్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది.
జట్లు(అంచనా)..
భారత్‌:
బుమ్రా(కెప్టెన్‌), గైక్వాడ్‌, జైస్వాల్‌, సంజు(వికెట్‌కీపర్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, దూబే, సుందర్‌, ఆర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, బిష్ణోయ్.
ఐర్లాండ్‌: స్టెర్లింగ్‌(కెప్టెన్‌), బల్‌బిర్నీ, టక్కర్‌(వికెట్‌ కీపర్‌), హారీ టక్కర్‌, గరెత్‌ డెలానీ, ఛాపర్‌, డోక్రెల్‌, అడైర్‌, మెక్‌ కర్టీ, జోషూ లిట్టిల్‌, క్రెగ్‌ యంగ్‌/వోక్రోమ్‌.