చైనా : ఆసియా క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించింది. రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ల బృందం ఈ స్వర్ణం సాధించింది. ఆసియా క్రీడలు 2023లో భారత్కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ క్రమంలో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. రుద్రాంక్ష్ పాటిల్, దివ్యాన్ష్, తోమర్తో కూడిన బృందం ఫైనల్లో 1893.7 పాయింట్లను నమోదు చేసింది. దీంతో గతంలో చైనా చేసిన 1893.3 పాయింట్ల రికార్డును అధిగమించింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఖాతాలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. 10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో జట్టుగా స్వర్ణం గెలిచిన రుద్రాంక్ష్, దివ్యాన్ష్, తోమర్ వ్యక్తిగతంగానూ ఫైనల్కు చేరుకోవడం విశేషం. ఫైనల్ కోసం జరిగిన పోటీల్లో రుద్రాంక్ష్ మూడో స్థానం, తోమర్ ఐదోస్థానం, దివ్యాన్ష్ ఎనిమిదో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు.










