Sep 26,2023 15:29

హాంగ్‌ ఝౌ : చైనాలోని హాంగ్‌ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో నేడు భారత్‌కు మరో స్వర్ణం లభించింది. ఈక్వెస్ట్రియన్‌ ఈవెంట్లో డ్రెస్సేజ్‌ విభాగంలో భారత్‌ అద్భుత విజయం సాధించింది. భారత ఈక్వెస్ట్రియన్‌ జట్టులోని సుదీప్తి హజేలా, దివ్యకతి సింగ్‌, హృదరు ఛెడా, అనుష్‌ అగర్వాలాలు భారత్‌ ఖాతాలో పసిడి పతకం చేర్చారు. కాగా ఆసియా క్రీడల్లో భారత్‌ మరో 3 పతకాలు కూడా లభించాయి. ఈ మూడు పతకాలు సెయిలర్లు సాధించినవే. తొలుత మహిళల డింగీ ఐఎల్‌ సీఏ4 ఈవెంట్‌ లో నేహా ఠాకూర్‌ రజతం సాధించగా, పురుషుల విభాగంలో ఎబాద్‌ అలీ కాంస్యం సెయిలింగ్‌ లో ఆర్‌ఎస్‌-ఞ విండ్‌ సర్ఫింగ్‌ ఈవెంట్‌ లో ఎబాద్‌ అలీ మూడో స్థానంలో నిలిచాడు. ఎబాద్‌ అలీ ఈ ఈవెంట్‌ లో 52 పాయింట్ల నెట్‌ స్కోరు నమోదు చేశాడు. ఇక పురుషుల డింగీ ఈవెంట్‌ లో విష్ణు శరవణన్‌ కాంస్యం నెగ్గాడు. ఐఎస్‌ సీఏ7 విభాగంలో విష్ణు శరవణన్‌ 34 పాయింట్ల నెట్‌ స్కోరు నమోదు చేశాడు. తాజా ఫలితాల అనంతరం, హాంగ్‌ ఝౌ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 14కి పెరిగింది.