May 11,2023 21:02

న్యూఢిల్లీ : మాన్‌కైండ్‌ ఫార్మా కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (ఐటి) అధికారులు గురువారం దాడులు చేశారు. న్యూఢిల్లీలోని సంస్థ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. ఈ కంపెనీ స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన రెండు రోజులకే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. ఐటి సోదాలతో ఓ దశలో 5 శాతం విలువ కోల్పోయిన కంపెనీ షేర్‌ తుదకు 0.16 శాతం నష్టంతో రూ.1,379.65 వద్ద ముగిసింది.