Sep 18,2023 20:00

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : విశాఖలో సోమవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వినాయక చవితి సందర్భంగా నగరవాసులు సాయంత్రం వేళ వినాయక ప్రతిములలో చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో భారీ వర్షానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఆర్‌కే బీచ్‌ సమీపంలోని ఓ మండపంపై రేకులు మీద పడి ఓ యుకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.