- హోరాహోరీ ఫైనల్లో పాకిస్తాన్పై గెలుపు
- ఏడోరోజు టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్లో పతకాలు
- 4వ స్థానంలోనే భారత్
హాంగ్జౌ : ఆసియా క్రీడల్లో ఏడోరోజు భారత్కు మరో రెండు బంగారు పతకాలు దక్కాయి. పురుషుల స్క్వాష్ టీమ్ విభాగం, టెన్నిస్ మిక్స్డ్ విభాగాల్లో భారత్కు పసిడి లభించాయి. అలాగే 10మీ. పిస్టల్ మిక్స్డ్లో భారత్కు మరో రజత పతకంతోపాటు 10వేల మీటర్ల పరుగులో రెండు పతకాలు దక్కాయి. దీంతో 7వ రోజు పోటీలు ముగిసే సరికి భారత్ మొత్తం 38 పతకాలతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 10బంగారు, 14రజత, మరో 14 కాంస్య పతకాలు ఉన్నాయి.

స్క్వాష్లో అదరగొట్టిన అభయ్ ...
శనివారం త్కంఠభరితంగా జరిగిన స్క్వాష్ ఫైనల్లో భారత్ 2-1తేడాతో పాకిస్తాన్ను చిత్తుచేసింది. మహేశ్, సౌరవ్ గోషల్, అభరు సింగ్లతో కూడిన భారత జట్టు నసీర్ ఇక్బాల్, మహ్మద్ ఆసిమ్, నూర్ జమాన్లతో కూడిన పాకిస్తాన్ జట్టుపై సంచలన విజయం సాధించింది. తొలి గేమ్లో మహేశ్ 8-11, 3-11, 2-11తో ఇక్బాల్ చేతిలో ఓడాడు. రెండో గేమ్లో సౌరవ్ ఘోషల్ 11-5, 11-1, 11-3తో మహ్మద్ ఆసీమ్పై గెలిచి 1-1తో స్కోర్ను సమం చేశాడు. నిర్ణయాత్మక మూడో గేమ్లో అభరు 11-7, 9-11, 7-11, 11-9, 12-10తో నూర్ జమాన్పై సంచలన విజయం సాధించాడు. ముఖ్యంగా ఐదో సెట్లో 8-10పాయింట్లతో ఓటమి కోరల్లో నిలిచిన అభరు.. వరుసగా నాలుగు పాయింట్లు సాధించి భారత జట్టు స్వర్ణ పతకం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.
టెన్నిస్లో బొప్పన్న జోడికి కూడా..
టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బొప్పన్న జోడికి బంగారు పతకాన్ని ముద్దాడింది. బొపన్న, రుతుజా భోస్లే జోడీ 2-6, 6-3, 10-4తేడాతో తైపికి చెందిన సుంత్ హౌ హువాంగ్, ఇన్ షౌ లియాంగ్ జంటపై గెలుపొందారు. రెండవ సెట్లో 27ఏళ్ల భోస్లే విరోచిత ఆటను ప్రదర్శించింది. స్టన్నింగ్ రిటర్న్ షాట్స్తో అదరగొట్టింది. ఆసియా క్రీడల్లో బొప్పన్నకు స్వర్ణ పతకం దక్కడం ఇది రెండోసారి.

10మీ. పిస్టల్ మిక్స్డ్లో రజతం..
10మీ పిస్టల్ మిక్స్డ్ విభాగంలో దివ్యా టిఎస్, సరబ్జోత్ సింగ్ జోడి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో భారత్ 14-16తో చైనా జోడి చేతిలో ఓడింది. షూటింగ్లో భారత్కు ఇది 19వ పతకం. ఫైనల్లో చైనా షూటర్లు జాంగ్ బోవెన్, జియాంగ్ కాంగ్జిన్లు బంగారు పతకాన్ని చేజిక్కించుకున్నారు. క్వాలిఫికేషన్ రౌండ్లో సరబ్జోత్ 291పాయింట్లు, దివ్య 286 పాయింట్లతో మొత్తం 577పాయింట్లతో ఫైనల్కు చేరారు. సాధించారు.
పురుషుల 10వేల మీటర్ల మారథాన్లో భారత్కు రజత, కాంస్య పతకాలు దక్కాయి. కార్తీక్ కుమార్, గుల్వీర్ సింగ్ ఈ పతకాలను సాధించారు. 10వేల పరుగును కార్తీక్ కుమార్ 28నిమిషాల 15:38సెకన్లలో, గుల్వీర్ సింగ్ 28నిమిషాల 17:21సెకన్లలో గమ్యానికి చేరారు. దీంతో అథ్లెటిక్స్ లో భారత్కు లభించిన పతకాల సంఖ్య మూడుకు పెరిగింది. అంతకుముందు షాట్పుట్లో కిరణ్ బలియాన్ కాంస్య పతకం నెగ్గిన సంగతి తెలిసిందే.

బ్యాడ్మింటన్ పురుషుల జట్టు 3-2తో కొరియాను ఓడించి ఫైనల్కు చేరుకుంది. శనివారం జరిగిన సెమీస్ తొలి సింగిల్లో హెచ్ఎస్ ప్రణరు 18-21, 21-16, 21-19తో గెలిచాడు. డబుల్స్లో సాత్విక్-చిరాగ్ 13-21, 24-26తో ఓడారు. లక్ష్యసేన్ 21-7, 21-8తో గెలుపొందగా.. దృవ్ కపిల-అర్జున్ (16-21, 11-21తో ఓడారు. నిర్ణయాత్మక ఐదో గేమ్లో కిదాంబి శ్రీకాంత్ 12-21, 21-16, 21-14తో కొరియా ప్లేయర్ ఛోపై నెగ్గి భారత్ను ఫైనల్కు చేర్చాడు.










