Mar 29,2023 20:34

హైదరాబాద్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ కొత్తగా గెలాక్సీ ఎ54, ఎ34 5జి మోడళ్లను విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లో వీటిని సామ్‌సంగ్‌ ఇండియా మొబైల్‌ బిజినెస్‌ జనరల్‌ మేనేజర్‌ అక్షరు రావు తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్లను సిగేచర్‌ గెలాక్సీ డిజైన్‌, నైట్‌గ్రఫీ వంటి కీలక ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎ54లో 50 ఎంపి కెమెరా, ఎ 34లో 48 ఎంపి ఒఐఎస్‌ ప్రాథమిక కెమెరాలను అమర్చామన్నారు. ఇవి తక్కువ వెలుతురులోనూ మంచి చిత్రాలను అందిస్తాయన్నారు. ఎ54లో 8జిబి, 128జిబి వేరియంట్‌ ధరను రూ. 38,999గా. ఎ34 ధరను రూ.30,999గా నిర్ణయించామన్నారు.