Nov 16,2023 12:08

దోడా : జమ్మూకాశ్మీర్‌ దోడాలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 3.9గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సెంటర్‌ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గురువారం ఉదయం 9.34 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు 33.05, పొడవు 76.18 దోడా ప్రాంతంలో భూకంపం సంభవించింది అని ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.